వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు అన్నీ కూడా భక్తుల తో పోటెత్తాయి.పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ రోజు ఆలయాల దర్శనాల కోసం తరలివెళ్లారు.
ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణా రాష్ట్ర మంత్రి హరీష్ రావు కూడా వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు తీవ్ర పరాభవం ఎదురైంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కు వచ్చిన హరీష్ రావు కు మంత్రి హోదా లో ఆయనకు టీటీడీ ప్రోటోకాల్ పాటించకపోవడం గమనార్ధం.ఒక మంత్రి హోదా లో తిరుమల కు చేరుకున్న హరీష్ కు అక్కడి టీటీడీ ప్రవర్తించిన తీరు విమర్శల పాలైంది.
టీటీడీ వైఖరి పట్ల మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ మంత్రికి పాటించాల్సిన ప్రోటోకాల్ ను పాటించకపోవడమే కాకుండా దర్శనానికి కూడా వెళ్ళడానికి నిరాకరించినట్లు తెలుస్తుంది.
దీనితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు హరీష్ రావు.దానితో టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ దౌత్యంతో మంత్రి హరీష్ రావు ను తిరిజి శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్లారు.
మరోవైపు ఈ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యుల తో కలిసి మరి తిరుమల చేరుకొని శ్రీవారి దర్శనం చేసుకున్నారు.అలానే సినీ ప్రముఖులు సుమలత, సునీల్, సప్తగిరి కూడా స్వామివారి దర్శనం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఏపీ నాయకులు మల్లాది విష్ణు, లక్ష్మీ పార్వతి, రాజేంద్ర ప్రసాద్ సైతం స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు.