బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీశ్ రావు మండిపాటు.. ఎందుకంటే.. ?

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి తక్కువగా ఉంది.ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉందని ప్రజల్లో అంసంతృప్తి రగులుకుంటుందట.

 Harish-rao-angry-over-bjp-and-congress-parties Telangana, Harish Rao, Angry, Bjp-TeluguStop.com

వరుసగా ఎన్నికలంటూ తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉంటుంది.అంతే కాకుండా ఆ ఎన్నికల్లో నిలచిన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి నానా తంటాలు పడుతుందట.

నిజాయితీగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తే ఈ తిప్పలు ఎందుకంటున్నారట అవినీతికి విసిగిపోయిన ప్రజలు.

ఇకపోతే తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయట.

ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటలు పేలుతున్న క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీశ్ రావు మండిపడ్డారు.ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా? తెలంగాణకు గిరిజన యూనివర్శిటీ ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు ఓటు వేయాలా? అని హరీశ్ ఎద్దేవా చేశారట.

ఇక కాంగ్రెస్ పార్టీ దివంగత పీవీ నరసింహారావుకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదని, ఆయనకు సమాధిని కూడా కట్టలేదని విమర్శించారు మరి మీ పార్టీ గత ఆరు సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏం వెలగబెట్టిందని కడుపుమండుతున్న కొందరు ప్రశ్నిస్తున్నారట.ఏది ఏమైనా పదవుల కోసం పాకులాడే వారున్నంత కాలం ప్రజల బ్రతుకులు బానిస బ్రతుకులే అని మరికొందరు భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube