తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.మొదటి మూడు వారాలతో పోల్చుకుంటే నాల్గువ వారం మరింత రసవత్తరంగా మారిందని చెప్పాలి.
కెప్టెన్ ఎంపిక కోసం జరుగుతున్న కిల్లర్ కాయిన్స్ టాస్క్లో ఇంటి సభ్యులు చెలరేగిపోయి ఆడుతున్నారు.తిట్టుకోవడం, అరుచుకోవడంతో పాటు ఒళ్ళు కూడా హూనం చేసుకుంటున్నారు.
అయితే మరోవైపు పులిహోర రాజాగా పెరు తెచ్చుకున్న అభిజిత్ మాత్రం గేమ్ ఆడుతూనే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన స్వాతి దీక్షిత్కు దగ్గర అవుతున్నారు.
వాస్తవానికి బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లినప్పటి నుంచి మోనాల్తో పులిహోర కలుపుతూ వచ్చిన అభిజిత్.
ఆ తర్వాత హారికను తగులుకున్నాడు.అయితే ఎప్పుడైతే స్వాతి దీక్షిత్ వచ్చిందో.
అప్పటి నుంచి మోనాల్, హారికలను పక్కన పెట్టేశాడు అభిజిత్.ఇక హౌస్లో, నామినేషన్స్లో స్వాతికి తోడుగా ఉన్న అభిజిత్ కిల్లర్ కాయిన్స్ టాస్క్లో కూడా సపోర్ట్ చేస్తూ.
ఆమెకు కాయిన్స్ ఇచ్చాడు.
దీంతో హారికకు మండిపోయిందని చెప్పాలి.ఈ క్రమంలోనే అభిజిత్ను స్వాతి గురించి డైరెక్ట్గా నిలదీసింది హారిక.స్వాతి వచ్చి కేవం రెండు, మూడు రోజులే అయింది.
తనకిచ్చిన ఇంటి పని కూడా చేయలేకపోతోంది, అయినా డేంజర్ జోన్లో కూడా లేదు.అలాంటప్పుడు నువ్వు స్వాతికెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని ప్రశ్నించింది.
కిల్లర్ కాయిన్స్ టాస్క్లో ఆమె కోసం కిందపడీ, కొట్లాడీ కాయిన్స్ సేకరించాల్సిన పనేంటని అభిజిత్ను అడిగింది హారిక.
నా స్నేహితుడు అయి ఉండి నాకిస్తావనుకున్నా.కానీ, నువ్వు స్వాతికి కాయిన్స్ ఇచ్చావు.అది నేను జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయింది హారిక.
దీంతో అభిజిత్ తనదైన శైలిలో సారీ చెప్పి.హారికను ఎలాగోలా కూల్ చేశాడు.
ఏదేమైనా అభిజిత్ స్వాతి దీక్షిత్కు దగ్గరవ్వడం.హారకకు నచ్చడం లేదనే చెప్పాలి.
కానీ, అభిజిత్ మాత్రం మోనాల్, హారిక, స్వాతి ముగ్గురికీ ఎప్పటికప్పుడు బిస్కెట్లు వేస్తూ.హాట్ టాపిక్ అవుతున్నాడు.