పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మరొకసారి వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అందులో ‘హరి హర వీరమల్లు’ సినిమా ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
క్రిష్ వీరమల్లు కంటే ముందే వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.
ఈ సినిమా కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసాడు.ఇక ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో క్రిష్ కొండపొలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
తాజాగా క్రిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా గురించి కూడా తెలిపాడు.ఈ వార్త విన్న అభిమానులు ఖుషీ అవుతున్నారు.
వీరమల్లు సినిమా షూట్ స్టార్ట్ చేసి ఇప్పటికే కీలక సన్నివేశాలను పూర్తి చేశారట.ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యినట్టు తెలిపారు.
ప్రెసెంట్ పవన్ ఇతర ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమాను నవంబర్ లో మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపారు.నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి జనవరి వరకు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేస్తాం అని క్రిష్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల షూటింగ్ పూర్తి అయినా తర్వాత కాస్త ఎక్కువ సమయం దీనికే పడుతుందని క్రిష్ తెలిపాడు.అందుకే ఈ సినిమా షూట్ ను జనవరి కల్లా పూర్తి చేసి రిలీజ్ సమయం ఏప్రిల్ అవడంతో మిగతా వర్క్ పూర్తి చేస్తామని క్రిష్ తెలిపాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.ఈ సినిమా ఏప్రిల్ 29 2022 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక అంతకంటే ముందు కొండపొలం సినిమా రిజల్ట్ కోసం క్రిష్ ఎదురు చూస్తున్నాడు.