పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.ఈయన ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు.
ఈయన లైనప్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ”హరిహర వీరమల్లు” ఒకటి.
ఈ సినిమా సగానికి పైగానే పూర్తి చేసుకుంది.క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.ఈ సినిమాను ఏ ఎం రత్నం పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్ ఉంటుంది అని నిర్మాత చెప్పినప్పటికీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.
ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ లో కన్ఫ్యూజ్ ఉంటూనే ఉంది.అయితే ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకున్న ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ తప్పేలా లేదు.ఎందుకంటే ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవకాశమే లేదు అని వార్తలు వస్తున్నాయి.మేకర్స్ సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తాం అని ఇటీవల స్టేట్మెంట్స్ ఇచ్చారు.
కానీ అది సాధ్యం అయ్యేలా లేదు అని అంటున్నారు.అందుకే ఈ సినిమాను దసరా కానుకగా భారీగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రెజెంట్ ఈ సినిమా 30 శాతానికి పైగానే పూర్తి చేయాల్సి ఉంది.పవన్ ఎప్పుడు ఈ సినిమా షూట్ లో పాల్గొంటాడో తెలియదు.అందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేటెస్ట్ గా సమాచారం బయటకు వచ్చింది.చూడాలి మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఎప్పటికి తీరేనో.