టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఏకంగా 150 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏఏం రత్నం నిర్మిస్తున్నాడు.
మొఘలాయిల కాలం నాటి బందిపోటు దొంగ కథగా దీనిని క్రిష్ తెరపై ఆవిష్కరిస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ని దర్శకుడు క్రిష్ రిలీజ్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.
ఈ వీడియో గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు.చారిత్రాత్మక నేపధ్యం ఉన్న జానపద చిత్రం కావడంతో పాటు పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి సారి వస్తున్న పీరియాడిక్ కాన్సెప్ట్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి క్రిష్ వరుణ్ తేజ్ కోసం రాసుకున్నాడని తెలుస్తుంది.
కంచె సినిమా తర్వాత ఈ కథని వరుణ్ తేజ్ తో క్రిష్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు.అయితే అప్పటికి వరుణ్ తేజ్ కి పెద్దగా మార్కెట్ లేకపోవడం, కొత్త హీరో కావడంతో వందకోట్లకి పైగా బడ్జెట్ పెట్టి సినిమా చేయడం కుదరదని డ్రాప్ అయిపోయాడు.
తరువాత జేమ్స్ బాండ్ తరహాలో ఒక కథని వరుణ్ కోసం సిద్ధం చేశారు.ఆ కథ కూడా పక్కకి వెళ్ళిపోయింది.తరువాత క్రిష్ వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు.అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అదే కథని చెప్పడం, అతను ఒప్పుకోవడం, నిర్మాత కూడా సెట్ కావడంతో వీరమల్లు కథకి క్రిష్ దృశ్యరూపం ఇస్తున్నాడు.
ఈ సినిమాతో కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో తనని విమర్శించేవారికి సమాధానం చెప్పాలని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.