పదేళ్ల పాటు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమైన చిరంజీవి రీఎంట్రీలో వరుసగా సినిమాలకు కమిటవుతూ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.రీఎంట్రీలో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి
ఆచార్య షూటింగ్ పూర్తైన తరువాత చిరంజీవి వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో నటించనున్నారు.వేదాళం రీమేక్ విషయంలో ఎటువంటి సమస్యలు లేకపోయినా లూసిఫర్ సినిమా డైరెక్టర్ విషయంలోనే గందరగోళం నెలకొంది.
మొదట ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి.అయితే సుజీత్ స్క్రిప్ట్ లో చేసిన మార్పులు చిరంజీవిని మెప్పించలేకపోయాయి
ఆ తరువాత చిరంజీవికి రీమేక్ సినిమాలతో విజయాలు అందించిన వీవీ వినాయక్ పేరు వినిపించింది.
అయితే వినాయక్ సైతం లూసిఫర్ స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్చలేకపోవడం, వినాయక్ చెప్పిన కామెడీ సీన్లు చిరంజీవికి నచ్చకపోవడంతో వినాయక్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.ఆ తరువాత దబాంగ్ రీమేక్ తో పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ పేరు వినిపించింది
అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం హరీష్ శంకర్ సైతం లూసిఫర్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
సరైన కారణాలు తెలియకపోయినా పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే హరీష్ శంకర్ లూసిఫర్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.