ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి.ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జాతికి చెందిన పక్షులు, జంతువులు కూడా ఉంటాయి.
ఇక కొన్ని పక్షుల విషయాలకొస్తే అవి వలస పోతూ వాటికి నచ్చిన ప్రాంతాలలో సేద తీర్చుకుంటాయి.కొన్ని రకాల పక్షులు తమకు కావాల్సిన సదుపాయాలు ఉన్నచోటే తమ గూటిని నిర్మించుకుంటాయి.
ఇలా ప్రతి ఒక్క పక్షి తమకు అనుకూలంగా ఉన్న చోట ఉండటమే కాకుండా ఏకంగా పక్షుల సమూహాన్నే చేస్తాయి.ఇక ఇదిలా ఉంటే ప్రతి ఒక్క పక్షి తమ ప్రాణాల రక్షణ కోసం ఉంటుండగా ఓ జాతికి చెందిన పక్షులు మంటల్లోకి దూకి ప్రాణాలు విడుస్తాయన్న విషయాన్ని అందరిని బాధపడేలా చేస్తుంది.
తూర్పు స్విట్జర్లాండ్ లో హప్లాంగ్ అనే చిన్న పట్టణంలో 40 వేలకు మించని జనాభా ఉంటుందట.ఈ ప్రాంతం సముద్రమట్టానికి 680 మీటర్ల ఎత్తులో, గువాహటి నగరానికి 355 కిలోమీటర్ల దూరంలో ఉంటుందట.
ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారగా చూడటానికి స్విట్జర్లాండ్ వలె ఉండటంతో స్విజర్లాండ్ తో పోలుస్తూ స్విజర్లాండ్ ఆఫ్ ఈస్ట్ అనే పేరుతో పిలుస్తారట.ఇక ఈ ఈ పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న జతింగ అనే గ్రామం ఉంటుందట.
అక్కడి ప్రాంతాలలో అదే చిన్న గ్రామము.ఇక అక్కడ ఎన్నో రకాల పక్షులు వలస ఉంటాయట.
ఇక్కడ ఓ జాతికి సంబంధించిన హరికిరి పక్షులు పొగ మంచు లో తిరుగుతూ కాలుతున్న మంటల్లోకి దూకి ప్రాణాలు వదిలేస్తాయట.
ఈ పక్షులు ఇలా మంటల్లో ఎందుకు దూకి ప్రాణాలు విడుస్తున్నాయో అని ఈ పక్షుల మీద అధ్యయనం చేయడానికి యూరప్, అమెరికా, జపాన్ దేశాలనుంచి ప్రతి ఏటా ఆర్నిథాలజిస్టులు వచ్చి పరిశీలించడంలో ఆ పక్షులు తుది శ్వాస విడిచి పెట్టడానికే వస్తున్నాయని అధ్యయనంలో తేలిందని అర్థమవుతుంది.