దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుని ప్రభావం లేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి.శనీశ్వరుని ప్రభావం వినాయకుడు, హనుమంతునిపై లేదని పురాణాలు చెపుతున్నాయి.
రామాయణంలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు హనుమంతుడు సముద్రంలో ఒక మార్గాన్ని నిర్మించాడు.
ఆ మార్గాన్ని నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి వస్తే అందరూ సముద్ర మార్గాన్ని నిర్మించటంలో సహాయం చేయటానికి వచ్చాడని భావించారు.
కానీ శని దేవుడు హనుమంతుణ్ణి పట్టటానికి వచ్చి తలపైకి ఎక్కి కూర్చున్నాడు.అప్పుడు హనుమంతుడు నేను రామ కార్యాన్ని చేస్తున్నాను.
కాబట్టి నా కాలు పట్టుకో అనే చెప్పాడు.దాంతో శనీశ్వరుడు హనుమంతుణ్ణి కాలును పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న సమయంలో హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుణ్ణి కాలితో నొక్కి పెట్టెను.
దాంతో శనీశ్వరునికి తప్పించుకొనే మార్గం లేకపోయింది.అందుకే హనుమంతుణ్ణి పూజిస్తే శని బాధలు ఉండవని చెప్పుతారు.