సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిరీక్షణ ఫలించింది.ఎన్నో రోజుల నిరీక్షణ కు ఫుల్ స్టాప్ పడింది.
ఎట్టకేలకు మహేష్, బాలకృష్ణ ల ఫైనల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఫైనల్ ఎపిసోడ్ కావడం అందులోను బాలయ్య, మహేష్ బాబు ఒకే వేదికపై కనిపించబోతుండడంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సీజన్ ఈ ఎపిసోడ్ తో ఎండ్ అవ్వబోతోంది.
ఇక తాజాగా ఈ ఎపిసోడ్ నుండి ప్రోమో విడుదల చేసారు మేకర్స్.
మహేష్ బాబు తో బాలయ్య సందడి మాములుగా లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ముందే తెలుసు.
మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.నిజ జీవితంలో కూడా హీరోగా ప్రజలు ఆభిమానిస్తూ ఉంటారు.
మహేష్ ఇప్పటి వారికి 1058 మంది చిన్నారులకు ప్రాణం పోసి ఆ కుటుంబాలకు దేవుడు అయ్యాడు.
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందించి ప్రాణదాతగా మారాడు మహేష్.
తాను చిన్నారులకు సేవ చేయడం గురించి గతంలో కూడా పలు సార్లు చెప్పాడు.తాజాగా బాలయ్య టాక్ షోలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
తాజాగా బయటకు వచ్చిన ఈ ప్రోమో ద్వారా ఈ విషయం తెలిసింది.ఇందులో మహేష్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నట్టు కనిపించింది.
అన్ని దానాల కన్నా ప్రాణదానం గొప్పది.అలంటి ప్రాణాలను కాపాడుతున్నందుకు మహేష్ బాబు పై ప్రశంసలు అందించారు.
ఈ ప్రోమోలో మహేష్ బాబు మాట్లాడుతూ. గౌతమ్ పుట్టినప్పుడు తన చెయ్యి అంతనే పుట్టాడని.
అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓకే.మరి లేని వాళ్ళ పరిస్థితి ఎలా అని అనిపించింది.అప్పటి నుండి చిన్నారులకు సేవ చేస్తున్నానని మహేష్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవ్వడంతో ఈ ప్రోమో చూసిన వారు మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి కూడా ట్విట్టర్ ద్వారా మహేష్ ను కొనియాడారు.”నిజంగా ఎంతో అస్పర్శవంతం.వేయి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన మహేష్ బాబు.వావ్ అంటూ చప్పట్లు కొట్టే ఎమోజి తో పాటు దండం పెట్టే ఎమోజీని కూడా పెడుతూ హ్యాట్సాఫ్” అంటూ రాసుకొచ్చాడు.
ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.