దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి హాన్సిక.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కుర్ర హీరోలు అందరితో జత కట్టిన హాన్సిక కోలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలకి కూడా జతగా నటించింది.
సౌత్ లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ హాన్సిక దూసుకుపోయింది.ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గిన ఫిమేల్ సెంట్రిక్ కథలతో ఎక్కువగా తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
మరో వైపు డిజిటల్ ఎంట్రీ కూడా హాన్సిక ఇవ్వబోతుంది.త్వరలో ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు సమాచారం.
మరో వైపు తమిళ్ లో ఆమె నటించిన 50వ చిత్రం మహా అనేక ఆటంకాలు దాటుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.
అలాగే మహా తర్వాత మరో సినిమాకి తమిళ్ లో ఒకే చెప్పింది.
అది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే తెలుగులో ఇప్పుడు హాన్సిక 52వ చిత్రాన్ని చేయబోతుంది.
తెనాలి రామకృష్ణ తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.మై నేమ్ ఈజ్ శృతి టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంబోత్సవం తాజాగా జరిగింది.
మొదటి సారి హాన్సిక తెలుగులో చేస్తున్న ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఇదే కావడం విశేషం.ఇప్పటి వరకు హీరోలకి జోడీగానే కనిపించిన ఈ భామ మొదటిసారి సోలోగా తనని తను ప్రూవ్ చేసుకోవడానికి మై నేమ్ ఈజ్ శృతి సినిమాతో ప్రయత్నం చేస్తుంది.
శ్రీనివాస్ ఓంకార్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇందులో హాన్సికకి జోడీగా సాయితేజ కనిపించబోతున్నాడు.