ముద్దుగుమ్మ హన్సిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.తనకు సంబంధించిన ప్రతి చిన్న పెద్ద విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఈ అమ్మడు తన ప్రైవేట్ ఫొటోలను సైతం అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటూనే ఉంటుంది.అటువంటి హన్సిక తాజాగా తాను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అని, దాన్ని వల్ల చాలా బాధ కలిగింది, తన తల్లి తనను ఓదార్చింది అంటూ ట్వీట్ చేసింది.
హన్సిక బ్లడ్ టెస్టు వ్యవహారం సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది.హన్సిక బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారట అనే వార్త దావాణంలో వ్యాపించింది.
దాంతో ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందారు.ట్విట్టర్లో ఆమెకు సానుభూతిగా, స్పీడ్ రికవరీ అంటూ ఎన్నో వేల ట్వీట్స్ వచ్చాయి.
దాంతో షాక్ అయిన ముద్దుగుమ్మ తనకు ఏం కాలేదు అని, జస్ట్ రెగ్యులర్ చెకప్లో భాగంగా బ్లడ్ టెస్టు చేయించుకున్నాను అంటూ తేల్చి చెప్పింది.దాంతో ఆమె అభిమానులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.
కాని మీడియా వర్గాల వారు మాత్రం ఈ అమ్మడు కాస్త అతి చేస్తోంది అంటూ విమర్శిస్తున్నారు.ఇలాంటి సిల్లీ విషయాలను కూడా ట్వీట్టర్లో పోస్ట్ చేయవద్దని ఆమెకు హితవు చెబుతున్నారు.