తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి “దేశముదురు” చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఆడిపాడి సందడి చేసినటువంటి బాలీవుడ్ బొద్దుగుమ్మ హన్సిక మొత్వాని గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే బాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకొని సినీ కెరీర్ ని దూకుడుగా ప్రారంభించింది.
అయితే తెలుగులో లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందింది.
అయితే తాజాగా హన్సిక మొత్వాని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.ఇందులో భాగంగా తాను చిన్న వయసు నుండే సినిమాల్లో నటించడం మొదలు పెట్టినట్లు తెలిపింది.
అందువల్ల పాఠశాల జీవితాన్ని పెద్దగా ఆస్వాదించలేక పోయానని చెప్పుకొచ్చింది.అంతేగాక తన సినిమాల చూసినటువంటి కొందరు స్నేహితులు ఎప్పుడైనా తాను పాఠశాలకు వెళితే సెలబ్రిటీ లాగా చూసేవారని దాంతో కొంత ఇబ్బందిగా అనిపించేదని తెలిపింది.
కానీ ఇప్పుడు తన బాల్యం గుర్తుకొస్తే చాలా సరదాగా అనిపిస్తుందని, అంతేగాక తాను చిన్నప్పుడు ఏం కోల్పోయానో బాగా అర్థం అవుతుందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో “మహా” అనే థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు జమీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఇటీవలే “పార్ట్ నర్” అనే తమిళ చిత్రంలో నటించేందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో కొత్త చిత్రాల అవకాశాలేమీ లేవు.