టాలీవుడ్ హీరోయిన్ హంస నందిని హీరోయిన్ గానే కాదు ఐటం సాంగ్స్ లో కూడా కుర్రకారుని హుశారెత్తేలా చేసింది.తన అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హంస నందిని క్యాన్సర్ బారిన పడినట్టు తెలుస్తుంది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు.కాసేపటి క్రితమే ఇన్ స్టాగ్రాం వేదిక ద్వారా తను ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్నానని అన్నారు హంస నందిని.
త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
తాను క్యాన్సర్ బాధితురాలిగా ఉండాలని అనుకోవడం లేదు.
భయంతో ప్రతికూల భావాలతో జీవించనని ఆమె అన్నారు.ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుని ముందడుగు వేయాలని అనుకుంటున్నానన్నారు.
తన తల్లి కూడా 18 ఏళ్ల క్రితం క్యాన్సర్ తోనే కన్నుమూశారని.ఆరోజు నుండి తాను ఆ భయంతోనే జీవిస్తున్నానని అన్నారు హంస నందిని.
నాలుగు నెలల క్రితం బ్రెస్ట్ లో కణితి ఉన్నట్టు అనిపించిందని.వెంటనే డాక్టర్ ను సంప్రదించానని.
వైద్య పరీక్షల్లో బ్రెస్ట్ క్యాన్సర్ గ్రేడ్ 3 దశలో ఉన్నట్టు తేలిందని అన్నారు.
క్యాన్సర్ తొలి దశలోనే ఉందన్న తన ఆనందం ఎంతోసేపు నిలవలేదని.తనకు జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారని ఆమె తెలిపారు.వైద్యులు చెప్పిన దాని ప్రకారం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70 శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం ఉందని.
దీనికి సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.ఇప్పటివరకు 9 సార్లు కీమో థెరపీ చేయించుకున్నానని.మరో ఏడూ కీమో థరపీలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.క్యాన్సర్ మహమ్మారిపై తాను నవ్వుతూ పోరాడుతే.
త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానని అన్నారు.అందరిలో ప్రేరణ నింపడానికి ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు హంస నందిని.