వేసవి కాలం వస్తున్న సందర్భంలో ప్రభుత్వం విద్యార్ధులకి ఒక పూట మాత్రమె స్కూల్స్ నిర్వహిస్తుంది.ఈ ఒంటి పూట బడులని శుక్రవారం నుంచి ఏపీలో అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ స్కూల్స్ తప్పకుండా అమలు చేయాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు.ఈ సమయంలో స్కూల్ ఉడటం 7.40 నిమషాల నుంచి 12.30 వరకు మాత్రమె నిర్వహించాలనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు.
అలాగే ఒంటి పూట బడులు నిర్వహించే సమయంలో స్కూల్ టైమింగ్ లోనే విద్యార్ధులకి మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయాలని కూడా విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ స్కూల్స్ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసాయి.
అలాగే పదవ తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్న వేళలో స్కూల్స్ ఉంటాయని కూడా తెలియజేసింది.