ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు ప్రభుత్వం వెబ్ సైట్స్ టార్గెట్ గా హ్యాకింగ్ కి పాల్పడుతూ వున్నారు.అయితే తాజాగా అది పార్టీ వెబ్ సైట్స్ కి కూడా పాకింది.
తాజాగా కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ వ్యక్తిగత వెబ్ సైట్ ని హ్యాకర్స్ హ్యాక్ చేసారు.ఇక హ్యాక్ చేసిన వెబ్ సైట్ లో ప్రధాని నరేంద్ర మోడీ మీద హ్యాకర్స్ వ్యంగ్య పోస్ట్ లు కూడా పెట్టారు.
ఈ రోజు ఉదయం వెబ్ సైట్ మీద సైబర్ నేరగాళ్ళు దాడి చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా వుంటే వెబ్ సైట్ బీజేపీ వెబ్ సైట్ లో హ్యాకర్స్ సోదరీ సోదరీమణులారా మిమ్మల్నందరికీ నేను ఫూల్ చేసాను, ఇంకా ఇలాంటివి చాలా రానున్నాయి.
కంగ్రాట్స్ అంటూ మోడీ చెప్పినట్లు గా మీమ్స్ క్రియేట్ చేసి హ్యాకర్స్ వెబ్ సైట్ లో పెట్టారు.ఇదిలా వుంటే ఇది పాకిస్తాన్ వాళ్ళు చేసిన పనిగా బీజేపీ పార్టీ నాయకులు చెబుతూ వున్నారు.
ఇక ఈ వెబ్ సైట్ ని హ్యాకింగ్ నుంచి తప్పించి రికవరీ చేయాలని బీజేపీ కొంత మంది ఐటీ నిపుణులని ఆశ్రయించింది.