అగ్ర రాజ్యం అమెరికాపై ఒక్క సారిగా హ్యాకర్లు దండెత్తారు.ఇప్పటికే కరోనా భారంతో ఆర్ధికంగా కుదేలవుతున్న అమెరికాపై తాజాగా హ్యాకర్లు దాడి చేయడం వెనుక ఎలాంటి అభిప్రాయం ఉండదనేది అమెరికా ఇంకా వెల్లడించలేదు.
అయితే ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతగా కరోనా టీకా గురించి ఎదురు చూస్తున్న సమయంలో, మరో పక్క బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న తరుణంలో ఈ హ్యాకర్ల దాడిపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నయాని అంటున్నాయి అమెరికా ఇంటిలిజన్స్ వర్గాలు.
అమెరికా ప్రభుత్వానికి సంభందించిన కొన్ని కీలక సమాచారాలు హాయ్కర్లు హ్యాక్ చేసి దొంగిలించినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వం లోని వివిధ శాఖలపై మార్వేల్స్ ద్వారా దాడులు జరిగి ఉండవచ్చని, అనుమానాలు వ్యక్తం చేస్తోంది అమెరికా ప్రభుత్వం.అయితే ఈ దాడులకు సంభందించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.
అమెరికాపై ఇంత భారీ స్థాయిలో హ్యాకింగ్ చేయడం వెనుక ఏ దేశం హస్తం ఉందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది.ఈ కోణంలోనే దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.ముఖ్యంగా రష్యా, చైనా లపై దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయనే అనుమానాలను స్థానిక మీడియా వ్యక్తం చేస్తోంది.
కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే సమయంలో ఈ దాడులు జరగడం అలాగే అమెరికా ట్రెజరీ , అడ్మినిస్ట్రేషన్ విభాగాలపై దాడులు జారడంతో అత్యంత కీలక సమాచారమే హ్యాకర్లు కాజేసి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ దాడుల వలన ఎలాంటి నష్టంకలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా జాతీయ సెక్యూరిటీ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది.