అమెరికాలో ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే మరో పక్క వలసవాసులకి ఇచ్చే హెచ్-1 బీ వీసా లు హౌస్ ఫుల్ అయ్యాయి.టెక్నాలజీ పరంగా ప్రతీ ఏటా అమెరికా ఇచ్చే హెచ్-1బీ వీసా అప్లికేషన్లు ఇప్పటికే లెక్కి మించి వచ్చాయని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.
ప్రతీ ఏటా అమెరికా 85 వేల మందికి మాత్రమే ఈ వీసాలని అందిస్తోంది.అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వీసాల సంఖ్య భారీగా పతనమయ్యింది.
వీసాలపై ట్రంప్ పెట్టిన ఆంక్షల వలన వలస వాసుల సంఖ్య తగ్గిపోయింది.ప్రస్తుతం హెచ్-1బీ వీసా కావాలని అనుకునే వారు రిజిస్ట్రేషన్ ద్వారా ఫీజుని చెల్లించి తమ పేరుని నమోదు చేసుకోవాలి.
ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ ఫీజుని 10 డాలర్లు గా నిర్ధారించారు.ఈ పేర్లని పరిశీలించిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పరిమితిని మించి ఉంటే లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారు.ఈ లాటరీ లో సెలక్ట్ అయిన వారి పేర్లు ఉంటే హెచ్ -1 బీ వీసాకి వారు అప్ప్లై చేసుకోవచ్చు…అయితే
ఎంపిక అయిన వారు 90రోజుల్లోగా హెచ్-1బీ వీసకోసం పిటిషన్ పెట్టుకోవాలి.ఈ పద్దతి వలన అనవసర ఖర్చులు తగ్గుతాయని,కేవలం ఎంపిక కాబడిన వారు మాత్రమే ఈ ఖర్చుని పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరూ నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు.మార్చి 31 వరకూ రిష్ట్రేషణ్ చేసుకున్న వారిలో లాటరీ ద్వారా ఎంపిక కాబడిన వారు ఏప్రియల్ 1 నుంచీ హెచ్ -1 బీ వీసాకి అప్ప్లై చేసుకోవచ్చు.