అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి లేదా ఉన్నత చదువులు చదువుకోవాలకునే వారికి తప్పకుండా కావాల్సింది హెచ్1 –బి వీసా.ఈ వీసా సాయంతోనే ఎంతో మంది విదేశీయులు అమెరికా వెళ్లి స్థిరపడుతున్నారు.
ముఖ్యంగా భారత్ లోని తెలుగు రాష్ట్రాల నుంచీ అమెరికా వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.ఈ క్రమంలోనే హెచ్1 –బి వీసా సాధించే క్రమంలో ఎంతో మంది మోసాలకు పాల్పడుతున్నారు.
మోసపోతున్నారు.తాజాగా అమెరికాలో మరో భారీ హెచ్1 –బి వీసా మోసం బయటపడింది.
హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది.వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న క్లౌడ్ జెన్ అనే కంపెనీ అమెరికాలో థర్డ్ పార్టీ పని ఉందని చెప్తూ భారత్ నుంచీ వచ్చే ఉద్యోగులకు నకిలీ కాంట్రాక్ట్ లు ఇప్పిస్తోంది.దాంతో ఈ కాంట్రాక్ట్ ఆధారంగా వారికి హెచ్1 –బి వీసాలు ఇస్తోంది ప్రభుత్వం.
సహజంగా అమెరికా వెళ్లేందుకు అవసరమైన హెచ్1 –బి వీసా పొందటం అంటే అంత సులువుగా అయ్యే పని కాదు.కానీ అమెరికాలోని ఈ క్లౌడ్ జెన్ కంపెనీ ఉద్యోగాలకోసం వెళ్ళే వారికి కోరుకున్న కంపెనీలో ఉద్యోగాలు వచ్చేలా చేస్తోంది, అయితే ఉద్యోగుల నుంచీ అందుకు గాను వారి నుంచీ భారీ మొత్తంలో వసూళ్లు చేసేదని ఇలా 2013 నుంచీ మొదలు 2020 మధ్య కాలంలో సదరు కంపెనీ మొత్తం ఉద్యోగుల నుంచీ దాదాపు 5 లక్షల డాలర్లు తీసుకుందని విచారణలో తేలింది.
టెక్సాస్ లో ఉన్న క్లౌడ్ కంపెనీ ప్రతినిధులు సైతం ఈ స్కామ్ నిజమేనని ఒప్పుకున్నారని అధికారులు తెలిపారు.అయితే సదరు కంపెనీ కి ప్రెసిడెంట్ గా పల్లెంపాటి శశి ఉన్నారని తేలింది.ఈ కంపెనీ అమెరికాలోని టెక్సాస్ లో మాత్రమే కాకుండా వర్జీనియాలో , కెనడా, రొమేనియా , హైదరాబాద్ లలో కుడా ఉందని తెలుస్తోంది.