అమెరికాలో స్థిరపడాలనే భారత ఐటీ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం పడిగాపులు కాచే అవసరం లేదని అంటున్నారు నిపుణులు.అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న విధానం వలన ఇకపై వీసా మంజూరు చేసే ప్రక్రియ వేగవంతంగా జరగనుందని తెలుస్తోంది.
ఇమ్మిగ్రేషన్ ఈ విధానంపై ఆదేశాలు కూడా జారీ చేసింది.పూర్తి వివరాలోకి వెళ్తే…భారత ఐటీ నిపుణులకి అమెరికా ఇమ్మిగ్రేషన్ గుడ్ న్యూస్ తెలిపింది.
హెచ్-1బీ వీసాలో చేస్తున్న మార్పుల కారణంగా ఇప్పుడు వీసా పొందే విధానం మరింత సులభతరం అవుతుందని తెలిపింది.2021 ఏడాది నుంచీ వచ్చే దరఖాస్తులని ఇకపై ఎలక్ట్రానిక్ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేసుకునేలా వీలు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది.ఐటీ నిపుణులని వివిధ దేశాల నుంచీ తీసుకునే కంపనీలు వారి వారి పూర్తి సమాచారాన్ని సమగ్రంగా తెలపాలని కోరింది.
రిజిస్ట్రేషన్ కోసం 10 డాలర్లని ఫీజుగా చెల్లించాలని, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అవ్వగానే లాటరీ పద్దతిలో 85 వీసాలు మంజూరు చేస్తారని ఇమ్మిగ్రేషన్ తెలిపింది.అంతేకాదు ఎలక్ట్రానిక్ పద్దతి వలన పపెర్ వర్క్ తగ్గుతుందని ఐటీ కంపెనీలకి ఉద్యోగుల సమాచారం ఇవ్వడం మరింత సులభం అవుతుందని అధికారులు అటున్నారు.అయితే 2020 – 21 సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 1 వ తేదీ నుంచీ 20 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రకటించారు.