ఏపీ మంత్రి కొడాలి నాని పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గత కొన్ని రోజులుగా కొడాలి నాని హిందువు ఆలయాల్లో దర్శనానికి డిక్లరేషన్ అవసరం లేదంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఎంపీ తప్పు పట్టారు.
హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు డిక్లరేషన్ ఎందుకంటూ ప్రశ్నించడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ మరియు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను కూడా కొడాలి నాని విమర్శించినట్లుగా మాట్లాడారు.
ఆ విషయమై ఎంపీ జివిఎల్ నరసింహారావు స్పందిస్తూ కొడాలి నాని కలియుగ శిశు పాలుడు మాదిరిగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో చంద్రబాబు నాయుడు వంద తప్పులు చేసి తన పథనాన్ని తానే కోరి తెచ్చుకున్నారు.ఇప్పుడు అలాగే మోడీ ని దూషించడంతో తన పథనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారని హెచ్చరించారు.
నాని తన తప్పును తెలుసుకొని వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా? లేదంటే మీ వ్యాఖ్యలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా అంటూ జివిఎల్ ప్రశ్నించారు.