రోడ్ సైడ్ ఫుడ్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు.చాలా టేస్టీగా అలా నోట్లో వేసుకుంటే ఇలా లోపలికి వెళ్లి ఆకలిని మాయం చేస్తుంది.
అంత టేస్టీగా ఉండే ఫుడ్ మనం తరచు తింటూనే ఉంటాం .కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శన మిస్తున్న వీడియోలు చుస్తే మనం జన్మలో బయట ఫుడ్ తినాలంటేనే భయపడి చస్తాం.వ్యాపారులు జనం ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
అసలే కరోనా కారణంగా వ్యాపారాలు పూర్తిగా నాశన మయ్యాయి.
అలాంటి సమయంలో కొంత మంది చేసే తప్పులు వల్ల మిగతా వ్యాపారాలు కుడి యిబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.కరోనా వచ్చిన దగ్గర నుండి బయట ఫుడ్ తినడం చాలా వరకు తగ్గించేశారు.
ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి అంత సెట్ అవుతున్న సమయంలో వ్యాపారాలు చేసే తప్పుల వల్ల జనం బయట ఫుడ్ అంటే పారిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ మధ్య పానీపూరి బండి వాడు అందులో మురికి నీరు కలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అయితే ఇప్పుడు మరొక వ్యక్తి చేసిన పనికి అందరు ఆశ్చర్య పోతున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
పోస్ట్ చేసిన కొద్దీ సమయంలోనే వైరల్ అయ్యింది.దీనిని చూసిన నెటిజెన్స్ ఆశ్చర్య పోవడంతో పాటు ఆ వ్యాపారిపై ఫైర్ అవుతున్నారు.
రోడ్ సైడ్ టిఫిన్ బండి నడుపుతున్న వ్యక్తి ప్లేట్ లను కింద ఉన్న మురికి నీరుతో కడుగుతూన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చుసిన నెటిజెన్స్ చూసిన నెటిజెన్స్ అతడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.అసలే కరోనా వ్యాధి సుబ్రత పాటించక పోతే వేగంగా వ్యాప్తి చెందుతుంది అని చెబుతున్న తరుణంలో ఇలా బాధ్యత లేకుండా ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతుండడం నిజంగా ఆశ్చర్యమే.