గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన సాగుతోందనిచ టిఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్ప ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమైందనంటూ పదే పదే విమర్శలు జడివాన గుప్పించే ఎంపీ గుత్తా సుకేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ని కలసిన అనంతరం మీడియాతో యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణంపై మాట్లాడేందుకు మాత్రమే సీఎం ను కలిశానని, తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్లకు తన పూర్తి మద్దతుంటుందని చెప్తున్నా….
ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని, భవిష్యత్లో ఏం జరగబోతోందో చెప్పలేనంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను వీడే విషయం స్పష్టం చేస్తున్నట్లుందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ ప్రోజక్టుల విషయమై చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నరని చేసిన విమర్శలు సైతం త్వరలో ఆయన కారెక్కబోతున్నారనేందుకు సంకేతాలుగా కనిపిస్తోందని గుత్తా అనుచరులలో వినవస్తోంది.