సాధారణంగా యువతులను యువకులు మోసం చేస్తుంటారని వింటూ ఉంటాం.కాకపోతే ఇక్కడ, ఓ ఏడాది పాటు సహజీవనం చేసి ఆ తర్వాత ప్రియురాలు వేరొకరితో పెళ్లి చేసుకోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు.
ఈ సంఘటన గురుగ్రం లో చోటు చేసుకుంది.గురుగ్రం నగరానికి చెందిన కుమార్ ఓ యువతి తో ప్రేమలో పడగా వారిద్దరూ కలిసి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని అందులో సహజీవనం చేస్తున్నారు.
సంవత్సరం రోజుల వరకు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటూనే ఆ తర్వాత ప్రియురాలుకి మంచి పెళ్లి సంబంధం కుదిరిందని దానితో ప్రేమికుడుని దూరం పెడుతూ వచ్చింది.ప్రియుడిని వదిలించుకోవడానికి వారి ఇంట్లో మన కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు పెళ్లి విషయం అంగీకరించలేదని మాయమాటలు చెప్పింది.
ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కుమార్ తన ప్రియురాలు మరో పెళ్లి చేసుకున్నందుకు ఇక నేనెందుకు జీవించడం ఆనుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అయితే అపస్మారక స్థితిలో ఉన్న కొడుకును గమనించిన తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇకపోతే కుమార్ రాసిన సూసైడ్ లెటర్ ద్వారా ఈ అసలు విషయాన్ని తెలుసుకోగలిగారు.అయితే ప్రస్తుతం యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు వైద్యులు తెలియజేశారు.
నేటి యువత తొందరపాటు నిర్ణయాలతో వారి ప్రాణం మీదకు తెచ్చుకోవడంతో పాటు ఇంట్లో వారు, మీ మీద అసలు పెట్టుకున్న వారు కూడా బాధ పడవలిసి వస్తుంది.