ఒక స్త్రీ కి రాత్రి పూటే కాదు పగలు కూడా ఎలాంటి రక్షణ లేదు అన్న విషయం ఈ తాజా ఉదంతం తో వెల్లడౌతోంది.ఇటీవల టోల్ ప్లాజా ల వద్ద ఉద్యోగుల పై దాడులు చోటుచేసుకుంటున్న విషయం విదితమే.
ఆ మధ్య టోల్ ప్లాజా వద్ద ఒక మహిళా ఉద్యోగి పై దాడి చోటుచేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా హరియాణా లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.అది కూడా పట్టపగలు టోల్ ప్లాజా మహిళా ఉద్యోగిని పై దాడి చోటుచేసుకుంది.
హరియాణాలోని గురుగ్రామ్ సమీపంలో డౌలా టోల్ ప్లాజా ఉన్నది.అందులో ఓ మహిళా బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తోంది.
అక్కడికి వచ్చిన ఓ కారు డ్రైవర్ తన దగ్గర ఉన్న కార్డును చూపించి ఫ్రీగా పంపించాలని అడిగాడు.అందుకు ఆ బిల్ కలెక్టర్ ససేమిరా అనడం తో డ్రైవర్ కారు దిగి వచ్చి ఆ మహిళపై దాడి చేశారు.
ఈ క్రమంలో ఆ మహిళ కూడా తిరిగి అతడిపై చేసుకుంది కానీ, అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సదరు డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
అయితే ఈ దృశ్యాలు అన్ని కూడా అక్కడి సీసీ టీవీ లో రికార్డ్ కావడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే వీడియో కాస్త బయటకు రావడం తో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
.