భారతదేశ స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తో, తమిళ హీరో విష్ణు విశాల్ వివాహం చేసుకోబోతున్నారు.ఇకపోతే వీరిద్దరికీ ఈ పెళ్లి రెండవది కావడం విశేషం.
ఇదివరకే తమిళ హీరో విష్ణు విశాల్ తన భార్య తో నవంబర్ 13, 2018 న విడాకులు తీసుకున్న సంగతి అందరికి విదితమే.ఇక ఆ తర్వాత కొన్ని రోజుల నుండి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తో ఆయన రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు.
బయటికి ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తెగ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు ఇద్దరు.
ఇలా వీరిద్దరూ ఫోటోలు షేర్ చేయడంతో నెటిజెన్స్ కూడా వీరిద్దరు ఒకటవడం ఖాయమని అప్పట్లోనే తెలియజేశారు.
ఇప్పుడు వారు అన్నట్టుగానే నేడు గుత్తాజ్వాల, విష్ణు విశాల్ ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు.నేడు గుత్తా జ్వాల పుట్టినరోజు సందర్భంగా విశాల్ ఆమె చేతికి ఉంగరం తొడిగి ఎంగేజ్మెంట్ జరిగినట్టు ప్రకటించారు.
ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను విష్ణు విశాల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.ఇక అందులో హ్యాపీ బర్త్డే గుత్తాజ్వాల… జీవితానికి కొత్త అర్థం సానుకూలంగా ఉందామంటూ… మన ఫ్యామిలీతో భవిష్యత్తు అందంగా ఉండేందుకు తగిన కృషి చేద్దాం అంటూ ట్వీట్ చేశాడు.
వీటితో పాటు కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ, అభిమానం కావాలంటూ తెలియజేశారు.ఈ కార్యక్రమానికి అవసరమైన ఉంగరాన్ని అర్ధరాత్రి సమయంలో తీసుకువచ్చిన గుత్తా మేనేజర్ బసంత్ జైన్ కు ఆయన ధన్యవాదాలు అంటూ ట్వీట్ పూర్వకంగా తెలియజేశాడు.
ఇక వారి ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.అయితే ఇది వరకే గుత్తాజ్వాల 2008 లో బాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ను, అలాగే హీరో విష్ణు విశాల్ 2001లో రజిని వివాహం చేసుకున్నారు.
ఈ ఇరు జంటల మధ్య మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు.