మంగళగిరిలో ప్రేమజంటపై దాడి కేసులో మృతి చెందిన జ్యోతి మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు.వారం రోజులుకి పైగా విచారణ తర్వాత, అనేక మలుపుల తర్వాత జ్యోతిని మర్డర్ చేసింది.
చివరికి జ్యోతిని చంపింది ప్రియుడు శ్రీనివాస్ అని పోలీసులు నిర్ధారించారు.అలాగే జ్యోతిని హత్య చేయడానికి శ్రీనివాస్ తన ఇద్దరు స్నేహితులైన పవన్, మరో వ్యక్తి సాయం తీసుకున్నాడని పోలీసులు తేల్చేసారు.
జ్యోతి మర్డర్ కోసం పవన్ వారం రోజులు ముందుగా రెక్కీ నిర్వహించి, హత్య స్థలం ఫిక్స్ చేసుకున్న తర్వాత శ్రీనివాస్, జ్యోతిని ఆ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళడం, మార్గ మధ్య లో ఇద్దరు స్నేహితులకి ఫోన్ చేయడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారని తెలుస్తుంది.తరువాత శ్రీనివాస్ జ్యోతిని కళ్ళు పట్టుకొని గట్టిగా పట్టుకుంటే, పవన్ ఇనుప రాడ్డుతో జ్యోతి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని తెలుస్తుంది.
అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి పవన్ శ్రీనివాస్ తలపై కూడా కొట్టాడని, ఇక తరువాత ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఇక శ్రీనివాస్ అక్కడి నుంచి తన డ్రామాని మొదలుపెట్టినట్లు పోలీసులు తేల్చేసారు.
ఇదిలా వుంటే శ్రీనివాస్ కి మొదటి నుంచి అమ్మాయిలని ట్రాప్ చేసి వాడుకోవడం, తరువాత వారిని వదిలించుకోవడం భాగా అలవాటని, అయితే జ్యోతి విషయంలో అతని ప్లాన్ రివర్స్ కొట్టడంతో, ఆమె పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో జ్యోతిని మర్డర్ చేయాలని శ్రీనివాస్ ప్లాన్ చేసి, ఫ్రెండ్స్ తో చెప్పి తన ప్లాన్ అమలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక హాస్పిటల్ లో చేరి తనకి మతిస్థిమితం కోల్పోయినట్లు శ్రీనివాస్ డ్రామా ఆడే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తేల్చేసారు.దీంతో ఇప్పటికే శ్రీనివాస్ స్నేహితులని అరెస్ట్ చేసిన పోలీసులు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన వెంటనే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇక అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు ఈ విషయాన్ని ద్రువీకరించే అవకాశం వుందని తెలుస్తుంది.