ఈ మధ్య కాలంలో కుటుంబ కలహాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయి.భార్యాభర్తలు ఒకరిపై మరొకరికి ఉన్న కోపాన్ని పిల్లలపై చూపిస్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లాలో కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ బిడ్డను ఐదో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది.కుటుంబ కలహాలు అభంశుభం తెలియని పాప ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి.
పాపను కిందను పడేసిన తల్లి ఆ తరువాత కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురం కమలేష్ అపార్టుమెంట్ లో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే 29 సంవత్సరాల మనోజ్ఞ, ఆమె భర్త హైదరాబాద్ లో పని చేస్తూ జీవనం సాగించేవారు.9 నెలల క్రితం ఈ జంట ఒక పాపకు జన్మనిచ్చింది.పాపకు తులసి అనే పేరు పెట్టి తల్లిదండ్రులు ఆ పాపను అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.
అయితే పెళ్లైన మొదట్లో సంతోషంగానే ఉన్న ఈ జంట మధ్య చిన్నచిన్న విషయాల వల్ల వివాదాలు తలెత్తాయి.
కొన్ని రోజుల క్రితం కరోనా, లాక్ డౌన్ వల్ల మనోజ్ఞ ఆమె భర్త గుంటూరుకు వెళ్లారు.అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ నిన్న మధ్యాహ్నం మనోజ్ఞ పాపతో పాటు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
అయితే మనోజ్ఞ తల్లిదండ్రులు మాత్రం మనోజ్ఞ ఆతమహత్య చేసుకోలేదని అల్లుడే కూతురిని, మనవరాలిని హత్య చేసి ఉండవచ్చని ఆరోపణలు చేస్తున్నారు.పోలీసుల దర్యాప్తులో ఈ కేసులో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది.