పంచాయతీ ఎన్నికల పంచాయితీ ఏపీలో ముగిసిందని అనుకుంటున్న సమయంలో మరో పోరు మొదలవ బోతుంది.ఈసారి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల హడావుడి మొదలైంది.
దీంతో ఇక్కడున్న పార్టీలు ఈ పోరుకు సిద్దం అవుతున్నాయట. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవి చూసిన టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా చాటాలనే పట్టుదలతో ఉందట.
ఈ నేపధ్యంలో గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని యోచిస్తోందని సమాచారం. కాగా తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర మేయర్ అభ్యర్థిని ఖరారు చేసింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిర్వహించిన సమావేశంలో మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పేరును ఖరారు చేశారు. వాస్తవానికి కోవెలమూడి రవీంద్ర పేరును పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఖరారు చేసింది.
ఈరోజు నేతలతో కూడా చర్చించిన తర్వాత ఆయను పేరును అధికారికంగా ప్రకటించారు.మరి ఈ ఎన్నికల్లో అయినా టీడీపీ కల నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి.