ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చెడ్డి గ్యాంగ్ తరచుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది.మూడు నెలల క్రితం వరకు హైదరాబాదులో చెడ్డి గ్యాంగ్ హడావిడి కనిపించింది.
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది గ్యాంగ్ గా ఏర్పడి హైదరాబాద్ లో వరుస దొంగతనాలు చేశారు.దొంగతనం చేసే సమయంలో వారు చెడ్డీలు వేసుకుని ఒంటి నిండా ఆయిల్ పూసుకొని చేయడంతో వారికి చెడ్డి గ్యాంగ్ అని పేరు వచ్చింది.
హైదరాబాద్ లో ఎప్పటికీ వీళ్ళ మీద పలు కేసులు నమోదయ్యాయి.కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా గుంటూరు జిల్లా వినుకొండలో చడ్డీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల అదుపులో ఉన్న ఆ ముగ్గురు గుజరాత్ కు చెందిన జశ్వంత్ భాయ్, తారా సింగ్, సబూర్ భాయ్ గా గుర్తించారు.
వినుకొండలోని శివసాయి అపార్ట్ మెంట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.వీరు అక్టోబరు 23న కూడా ఇదే అపార్ట్ మెంట్ వద్ద కలియదిరిగినట్టు గుర్తించారు.
నిందితులు నరసరావుపేటలో కూడా పలు చోరీలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.వీరిని విచారిస్తున్న పోలీసులు గుంటూరు దొంగతనాలు పరిసరాల్లో జరిగే దొంగతనాలతో వీరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి… ఇంకా ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.