ఒక్క బంధాన్నే లాగలేకపోతున్నారు కొందరు.నడి సముద్రంలో మునిగిపోయి ఉన్నా కాపాడంటూ తమ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వాపోతుంటారు.
పెళ్లంటే నూరేళ్ల పంట కాదు మంటలా ఫీలైపోతుంటారు.కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు వివాహాలు చేసుకున్నాడు.
కృష్ణా జిల్లాకు చెందిన శీలం సురేష్.స్థానిక ప్రభుత్వ పాఠశాలతో ప్రధానోపాధ్యాముడిగా కొనసాగుతున్నాడు.ఈయన ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనిపించిందో ఏయో కానీ, ఏకంగా ముడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.అయితే ఈ విషయం అతడి రెండో భార్య శైలజ తెలవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో దిశా పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న శీలం సురేశ్ మొదటగా 2011లో గుంటూరుకు చెందిన శాంతిప్రియను వివాహం చేసుకున్నాడు.
ఆమె తర్వాత 2015లో ఉయ్యూరుకు చెందిన శైలజ అనే యువతిని, 2019లో విశ్వనాథపల్లికి చెందిన అనుషను పెళ్లి చేసుకున్నాడు.దీంతో కొందరు ఇటీవల ప్రకాశం జిల్లాలో ఓ నిత్య పెళ్లికూతురు బాగోతం భయటపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అక్కడ నిత్య పెళ్లికూతురైతే.ఇక్కడ నిత్య పెళ్లి కొడుకని హేళన చేశారు.
ప్రధానోపాధ్యాయ వృత్తికే మారని మచ్చ శీలం సురేష్ అని, ఇప్పుడే ఇలా ఉంటే రేపు పాఠశాలలో చదువులు ఎలా చెప్తాడని పలువురు ఆరోపిస్తున్నారు.భవిష్యత్ లో మరెంత మంది మహిళల జీవితాలతో ఆడుకుంటాడని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘ నాయకులు డిమాండ్.
ఆ మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.