గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌరాణిక కథాంశం అయినా శాకుంతలం స్టోరీని తెరపైకి తీసుకొస్తున్నారు.మహాభారతంలో దృశ్యకావ్యంగా చెప్పబడుతున్న ఈ శకుంతల, దుష్యంతుడు ప్రయాణ ప్రేమకథని తెరపై అంతే అందంగా మలిచేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం స్టార్ హీరోయిన్ సమంతని ఖరారు చేశారు.గుణ టీం వర్క్స్ పైన గుణశేఖర్ కూతురు ఈ సినిమాతో నిర్మాతగా మారుతుంది.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా తర్వాత గుణశేఖర్ హిరణ్యకశ్యప సినిమా స్టార్ట్ చేస్తాడు.
ఇదిలా ఉంటే శకుంతల కథ ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించాలని గుణశేఖర్ అనుకుంటున్నారు.దానికోసం ఇప్పటికే వర్క్ మొదలుపెట్టేశారు.
సినిమాని మేగ్జిమమ్ గ్రీన్ మ్యాన్ స్టూడియోలోనే చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మైథలాజికల్ కథాంశం కావడంతో అప్పటి కాలమాన పరిస్థితులు, దృశ్యసౌందర్యం తెరపై ఆవిష్కరించాలంటే సీజీలోనే సాధ్యం అవుతుంది.ఈ నేపధ్యంలో మెజారిటీ సినిమా షూటింగ్ గ్రీన్ మ్యాన్ లోనే తెరకెక్కించబోతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే గుణశేఖర్ స్టార్ట్ చేసేశారు.
దానికి సంబందించిన స్నాక్ పిక్ వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ఫస్ట్ సమంత ఫస్ట్ లుక్ కి సంబందించిన విజువల్ ని ఆవిష్కరించబోతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
ఇక చాలా మంది టెక్నీకల్ ఎక్స్ పర్ట్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.ఇక సినిమాలో దుష్యంతుడు పాత్ర కోసం గుణశేఖర్ అన్వేషణ మొదలు పెట్టాడు.
పాన్ ఇండియా సినిమా కావడంతో మంచి టాలెంటెడ్ యాక్టర్ ని వెతికి పట్టుకునే పనిలో పడ్డాడు.తమిళ్, మలయాళీ యాక్టర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు బోగట్టా
.