సిల్వర్ స్క్రీన్ పై భారీ సెట్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు గుణశేఖర్.ఎవ్వరూ సెట్స్ మీద ఆధారపడక ముందే భారీ బడ్జెట్ తో సెట్స్ వేసి సినిమాలో మెజారిటీ పార్ట్ ని అక్కడే కంప్లీట్చేసిన ఘనత గుణశేఖర్ కి దక్కుతుంది.
ఇప్పుడు చాలా మంది దర్శకులు అతన్ని అనుసరిస్తూ షూటింగ్ లొకేషన్ కోసం ఎక్కడికో పరుగులు పెట్టకుండా సింపుల్ గా కావాల్సిన స్టైల్ లో సెట్స్ వేసుకొని అందులోనే కానిచ్చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం గుణశేఖర్ సమంతతో శాకుంతలం అనే పౌరాణిక ప్రేమ కావ్యాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.దీనికోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా వేయించారు.
రుద్రమ్మదేవి మూవీ తర్వాత భాగా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ రానా దగ్గుబాటితో హిరణ్యకశిప మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో చేద్దామని భావించాడు.
అయితే దీనికి సురేష్ బాబు ఇంకా సమయం కావాలని అడగడంతో లోపు తన సొంత ప్రొడక్షన్లోనే సమంతతో శాకుంతలం మూవీ స్టార్ట్ చేసేశాడు.ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది.ఇందులో సమంతకి జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళీ హీరో దేవ్ మోహన్ ని ఫైనల్ చేశారు.
ఈ కథ మొత్తం సమంత చుట్టూనే తిరుగుతూ ఉండటంతో దుష్యంతుడి పాత్రకి స్టార్ హీరోని కాకుండా ఓ కొత్త హీరో వైపు గుణశేఖర్ వెళ్ళాడు.ఇదిలా ఉంటే గుణశేఖర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లిస్టులో రుద్రమ్మదేవి సీక్వెల్ కూడా వచ్చి చేరింది.
రుద్రమ్మదేవి మనవడు అయిన ప్రతాపరుద్రుడు కథని తెరపై అదే టైటిల్ తో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ మూవీని హిరణ్యకశిప తర్వాత స్టార్ట్ చేస్తాడా లేదంటే ముందు దానిని పూర్తి చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.