సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అంటూ కొన్ని వందల మంది రచయితలు దర్శకులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకుంటూ తిరుగుతున్న వారు ఫిల్మ్ నగర్ సినిమా ఆఫీస్ల్లో ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు.
కాని ఈ దర్శకుడు మాత్రం ఎంతో మంది నిర్మాతలు ఈయనతో సినిమాలు తీసేందుకు ఆసక్తిగా ఉన్నా, పలువురు స్టార్స్ ఈయన దర్శకత్వంలో నటించేందుకు రెడీగా ఉన్నా సినిమా చేసేందుకు మాత్రం ఏళ్ల తరబడి మీన మేషాలు లెక్కిస్తున్నాడు.
రుద్రమదేవి చిత్రంను అయిదు సంవత్సరాల క్రితం విడుదల చేసిన దర్శకుడు గుణశేఖర్ ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని కనీసం మొదలు కూడా పెట్టలేదు.
ఈయనకు రుద్రమదేవి చిత్రం మంచి టాక్ను తెచ్చి పెట్టడంతో పాటు దర్శకుడిగా ప్రశంసలు కురిపించింది.భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు గుణశేఖర్ గతంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు.
కాని ఇప్పుడు మాత్రం ఈయన సినిమాలు చేయడం లేదు.
ఈయన చేస్తే ఏడాదికి ఒక సినిమా అయినా వస్తుంది.
కాని హిరణ్య కశ్యప అంటూ ఒక్క ప్రాజెక్ట్ను పట్టుకుని దాదాపుగా నాలుగు ఏళ్లుగా నాన్చుతున్నారు.అది మరో మూడు నాలుగు ఏళ్లు అయినా కూడా ప్రారంభం అవుతుందో తెలియదు.
ప్రారంభం అయినా మరో మూడు సంవత్సరాలు పడుతుంది.అంటే రుద్రమదేవి వచ్చిన పదేళ్లకు గాని ఈయన తదుపరి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాదన్నమాట.
క్రేజ్ ఉన్న ఒక దర్శకుడు ఇలా ఆలస్యం చేయడంను తప్పుబడుతున్నారు.అసలు ఈ దర్శకుడికి బుద్ది ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.