మూడు సంవత్సరాలు కష్టపడి గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రం దసరాకు ముందు విడుదల అయిన విషయం తెల్సిందే.
సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.దాంతో నష్టాలు కోట్లల్లో తప్పవని అంతా విశ్లేషించారు.
‘బ్రూస్లీ’ విడుదల తర్వాత కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవ్వడం ఖాయం అని అన్నారు.కాని ‘రుద్రమదేవి’ చిత్రం కలెక్షన్స్ మూడు వారాల పాటు నిలకడగా సాగాయి.
దానికి తోడు దసరా పండుగ సెలవులు ఉండటంతో ‘రుద్రమదేవి’కి కలిసి వచ్చింది.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర నిర్మాత గుణశేఖర్ దాదాపుగా సేఫ్ జోన్లో పడ్డట్లే అని అంటున్నారు.
మొదటి రెండు వారాల్లో ఈ సినిమా 60 కోట్లు వసూళ్లు చేసింది.లాంగ్ రన్లో మరో పది కోట్లు వసూళ్లు చేసే అవకాశాలున్నాయి.
ఇక శాటిలైట్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడు పోయింది.దీంతో గుణశేఖర్కు లాభాలు వచ్చినట్లే అని విశ్లేషకులు అంటున్నారు.
సినీ వర్గాల వారు సైతం గుణశేఖర్కు లాభాలు రాక పోయినా నష్టాలు మాత్రం వచ్చి ఉండవు అని అంటున్నారు.మొత్తానికి గుణశేఖర్ కలెక్షన్స్ను చూసి ఊపిరి పీల్చుకుంటున్నాడు.
ఈ సినిమాకు ‘ప్రతాప రుద్రుడు’ సీక్వెల్ రాబోతున్న విషయం తెల్సిందే.