టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ పీరియాడికల్ చిత్రాలకు కేరాఫ్గా మారిపోయిన సంగతి తెలిసిందే.అనుష్క లీడ్ రోల్లో నటించిన రుద్రమదేవి చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయం సాధించడంతో తన నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసగా పీరియాడికల్ కథలతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ క్రమంలో తన నెక్ట్స్ మూవీగా ‘హిరణ్యకశిప’ను తెరకెక్కించాలని చాలా కాలంగా గుణశేఖర్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు.కానీ ఆ సినిమా కోసం మరింత సమయం పడుతుండటంతో, తన నెక్ట్స్ ప్రాజెక్టుగా ‘శాకుంతలం’ను అనౌన్స్ చేశాడు ఈ డైరెక్టర్. మహాభారతంలోని ఆదిపర్వంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న శకుంతల-దుష్యంతుల ప్రేమ కథను ‘శాకుంతలం’ సినిమాలో మనకు చూపెట్టేందుకు గుణశేఖర్ రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నండీ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతూ వస్తోంది.
కాగా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో అందాల భామ సమంత నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఆమెకు జోడీగా ఈ సినిమాలో హీరో ఎవరు నటిస్తున్నారనే అంశంపై సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈ వార్తలను నమ్మొద్దంటూ దర్శకుడు గుణశేఖర్ వేడుకున్నారు.
శాకుంతలం చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా, తాము స్వయంగా తెలియజేస్తామని, ఈ సినిమాలో కేవలం సమంత ఎంపిక మాత్రమే జరిగిందని, ఇంకా హీరో ఎంపిక జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు.
దీంతో సమంతకు జోడీగా ఈ సినిమాలో హీరో ఎవరు నటిస్తున్నారా అనే అంశం ఇంకా సస్పెన్స్గానే ఉండిపోయింది.ఇక అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు.
మరి శాకుంతలం చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు సినీ ప్రియులు.