బాలీవుడ్ నటి కంగన రనౌత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఎప్పటికప్పుడు బాలీవుడ్ లో నేపోటిజంపై మాట్లాడే ఆమె ఇంటి వద్ద తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.మనాలీలోని సొంత భవంతిలో నివసిస్తున్న కంగనా రనౌత్కు భవంతి సమీపంలో శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఉన్నట్లుండి తుపాకీతో కాల్పులు చప్పుళ్లు వినిపించాయి.
దీంతో ఆ చెప్పుళ్ళకు బెదిరిపోయిన ఆమె వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే ఈ విషయంపై మాట్లాడిన కంగనా రనౌత్ మొదట తుపాకీ చెప్పులు అని అనుకోలేదని, రెండొవసారి విన్నప్పుడు అర్థం అయ్యింది అని ఆమె చెప్పారు.
అలా తుపాకి చప్పుళ్లు వినిపించి ఎవరో తనను బెదిరించడానికి ప్రయత్నిచినట్టు కంగనా ఆరోపించారు.
డబ్బు కోసమే ఇలా చేసి ఉంటారని ఆమె చెప్పారు.అంతేకాదు.
ఈ దేశంలో విచ్చలవిడిగా గూండాగిరి చేస్తున్నారని, సూశాంత్ సింగ్ రాజ్ పుత్ ని కూడా ఇలానే భయపడి ఉంటాడు అని ఆమె అన్నారు.కాగా ఈ ఘటన ఇలా ఉండగా విచారణ జరిపి త్వరలోనే నిందితులను పట్టుకుంటాం అని స్థానిక పోలీసులు తెలిపారు.
కాగా ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.