హైదరాబాద్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.ఆర్టీసీ సాధారణ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తుంది.
పంజాగుట్ట వద్ద ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం తో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.అయితే బస్సు పై భాగం నుంచి బుల్లెట్లు దూసుకుపోవడం తో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.
అయితే ఒకపక్క బస్సు లో కాల్పులు చోటుచేసుకున్నప్పటికీ బస్సు డ్రైవర్ మాత్రం బస్సును ఆపకుండా ముందుకు నడిపినట్లు తెలుస్తుంది.
అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి సఫారీ డ్రస్సు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలపడం తో అతడిని అన్వేషించే పనిలో పడ్డారు అధికారులు.
అయితే అతడి వద్ద గన్ ఎందుకు ఉంది.అసలు ప్రయాణికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.ఈ ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.