తెలుగులో ఇటీవలే ప్రముఖ దర్శకుడు “జి.నాగేశ్వర రెడ్డి” దర్శకత్వం వహించిన “గల్లీ రౌడీ” చిత్రం ఈ నెల 17వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో హీరోగా హీరో సందీప్ కిషన్ నటించగా యంగ్ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే కాగా ఈ చిత్రంలో బాబీ సింహ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నటుడు సందీప్ కిషన్ కి ఈ చిత్రం కొంత మేర ఊరట కలిగించిందని చెప్పవచ్చు.
అయితే ట్రైలర్ తో అంచనాలను క్రియేట్ చేసిన సందీప్ కిషన్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకున్నాడు.
కాగా ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే దాదాపుగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ ని నమోదు చేసింది.ఇక గత రెండు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఒక కోటి 75 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది.
దీంతో బ్రేక్ ఈవెన్ 4 కోట్ల రూపాయలు కావడంతో మరో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ నమోదు చేస్తుంది.మరి బ్రేక్ ఈవెన్ ని నమోదు చేసి హిట్ అవుతుందో లేక ఫ్లాప్ అవుతుందో చూడాలి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సందీప్ కిషన్ తమిళంలో “నరకాసురన్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు “కార్తీక్ నరేన్” దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత “బద్రీ కస్తూరి” నిర్మిస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు తమిళనాడు పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.