ఐపీఎల్-2022 సీజన్లో అందరినీ ఆశ్చర్యపరిచిన జట్టు ఏదైనా ఉందంటే.అది గుజరాత్ టైటాన్స్.
టోర్నీ ప్రారంభానికి ముందు ఈ టీంలో స్టార్ ఆటగాళ్లు లేరని, జట్టు బలహీనంగా ఉందని కామెంట్లు చేశారు.అయితే లీగ్ ప్రారంభమయ్యాక వరుస విజయాలు సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది.
దీంతో క్రికెట్ అభిమునులకి గుజరాత్ టైటాన్స్ పై అంచనాలు పెరిగాయి.ఈ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యాని కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ ఇప్పటివరకు 13 మ్యాచ్లలో 10 గెలిచి 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.తద్వారా పట్టికలో అగ్రస్థానంతో పాటు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా అవతరించింది.
దీంతో గుజరాత్ ఆటగాళ్లు ఫుల్ జోష్లో ఉన్నారు.ఇటీవల ఐపీఎల్ టీమ్స్ లోని క్రికెటర్లు అంతా సరదాగా గడపడం, సినిమాలు చూడటం, ఇంటర్వ్యూలు చేయటం లాంటివి చేశారు.
అంతా ఒక్కచోట చేరి తమ విజయాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు.గుజరాత్ ఆటగాళ్లు కూడా తమకంటూ ఓ ‘మ్యూజిక్ బ్యాండ్’ ఏర్పాటు చేసుకుని పాటలు పాడుతూ సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
స్పిన్నర్ రషీద్ ఖాన్ అయితే దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో షారుఖ్ ఖాన్ గిటార్ వాయించిన తరహాలో స్టిల్స్ ఇచ్చాడు.కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సాయి సుదర్శన్, విజయ్ శంకర్ తదితర ఆటగాళ్లు ప్రముఖ తమిళ పాట ‘వై దిస్ కొలవెరి డి’ అంటూ తమ గాన ప్రతిభను చాటుకున్నారు.వీటికి సంబంధించిన వీడియోలను గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో అవి కాస్తా వైరల్గా మారాయి.ఈ వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.