సముద్ర వ్యూను ఎంజాయ్ చేస్తున్న ఈ నటి ఎవరో గుర్తు పట్టారా? లేదా! ఆమె మన టాలీవుడ్ హీరోయినే.గుర్తొచ్చిందా! లేదు కదా! సరేలెండి.
నేనే చెప్పేస్తా.ప్రగ్య జైస్వాల్.
మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామకు వరుణ్ తేజ్ తో కలిసి నటించిన కంచె సినిమాతో మంచి ఫెమ్ వచ్చింది.
నిజానికి ఈ ప్రగ్య జైస్వాల్ అందంలో ఆహా అనిపించినప్పటికి అదృష్టం మాత్రం లేదు.
ఈ విషయాన్నీ టాలీవుడ్ ప్రముఖులు చెప్పడం కాదు.ఆమె తీసిన సినిమాలు చూస్తేనే అర్థం అవుతుంది.
తనకు నిజంగానే అదృష్టం లేదని.కంచె సినిమాతో ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
అవకాశాలను ఉపయోగించుకున్నప్పటికి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.ఆమె 2018లో ఆచారి అమెరికా యాత్ర అనే సినిమాలో మంచు విష్ణు సరసన నటించింది.ఆ సినిమాకు పెద్ద ఫెమ్ ఏం రాలేదు.ఇప్పుడు పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటి అందులో ఎంత నిజం ఉందనేది సినిమా వచ్చే వరకు తెలియదు.
టాలీవుడ్ హీరోయిన్ అయిన ప్రగ్య ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది.మరి ఈ ఛానెల్ ప్రయత్నం ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.