ఏపీలో గుడివాడ క్యాసినో రచ్చ రోజురోజుకూ ఎక్కువవుతోంది.వైసీపీ పార్టీలో మంత్రిగా ఉన్న కొడాలి నాని తనకు గుడివాడలో ఉన్న కన్వెన్షన్ సెంటర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా క్యాసినో నిర్వహించారని పలువురు ఆరోపించారు.
దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇలా పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే టీడీపీ పార్టీ నిజ నిర్ధారణ కమిటీని వేసింది.
ఈ కమిటీలో టీడీపీ సీనియర్ నేతలు బోండా ఉమ, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా ఈ రోజు నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన బోండా ఉమ తదితరులు గుడివాడకు వెళ్లారు.
అక్కడి టీడీపీ ఆఫీసుకు వెళ్లిన వీరు అక్కడి నుంచి క్యాసినో నిర్వహించారని చెబుతున్న కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లబోతే అక్కడికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు.దీంతో బోండా ఉమ తదితర టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పోలీసులతో చిన్న పాటి వాగ్వాదం పెట్టుకున్నారు.
అదే సమయంలో.
ఇలా టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్న సమయంలో ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ కారు అద్దాలను ధ్వంసం చేశారు.దీంతో టీడీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలంలా తయారయ్యారు.కొంత మంది పోలీసుల సహకారంతోనే వైసీపీ నేతలు తమ నాయకుడు బోండా ఉమ కారు అద్దాలను ధ్వంసం చేశారని వారు ఆరోపిస్తున్నారు.
దీంతో గుడివాడలో వాతావరణం ఒక్క సారిగా హీటెక్కింది.దీంతో అక్కడికి చేరుకున్న మరింత మంది టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు.ప్రస్తుతం గుడివాడలో పరిస్థితి రణరంగాన్ని తలపించేదిలా ఉంది.క్యాసినో రచ్చ కాస్త చిలికి చిలికి గాలి వానలా తయారయి టీడీపీ నేత కారుపై దాడి వరకూ వెళ్లింది.
ఈ కేసు ముందు ముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో…
.