గూఢచారి సీక్వెల్ కి కథ సిద్ధం చేస్తున్న హీరో

అడవి శేష్ కెరియర్ లో క్షణం సినిమా ఒక టర్నింగ్ అని చెప్పాలి.క్షణం సినిమా నుంచి థ్రిల్లర్ జోనర్ లో వెళ్తున్న అడవి శేష్ కి తెలుగు స్పై థ్రిల్లర్ గా వచ్చిన గూఢచారి సినిమా మరో సాలిడ్ హిట్ ని అందించింది.

 Gudachari Sequel Story Ready In Lock Down Time, Tollywood, Telugu Cinema, Adavi-TeluguStop.com

ఆ మధ్య కాలంలో ఎవరు సినిమాతో మరో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో హిట్ కొట్టాడు.ఇక ఇండియన్ స్పై థ్రిల్లర్ కథలు ఈ మధ్య కాలంలో పెద్దగా రావడంతో హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ తరహాలో సినిమా చేయాలని చాలా కాలంగా మహేష్ బాబు చూస్తున్నాడు.

అయితే ఊహించని విధంగా గూఢచారి సినిమాతో అడవి శేష్ స్పై థ్రిల్లర్ తో ముందుకి వచ్చేసాడు.ఇక దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుంది అనే విషయం ఎప్పుడో చెప్పేసారు.

ప్రస్తుతం అడవి శేష్ మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నాడు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.దీంతో ఈ టైంని అడవి శేష్ గూఢచారి కథని సిద్ధం చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు.

సమయం దొరకడంతో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.మొదటి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సారి మరింత థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ కథని అడవి శేష్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక వచ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమాకి దర్శకుడుగా అడవి శేష్ ఎవరిని పరిచయం చేస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube