పాపం.కరోనా కారణంగా పండ్ల విక్రేతలు, రైతుల జీవితం చిన్నాభిన్నం అయ్యింది.పండ్లు కొనే వారే కరువయ్యారు.కరోనా వైరస్ ముందు 8 రూపాయిలు 9 రూపాయిలు ఉన్న జామ పండును సైతం ఒక్క రూపాయికే అమ్ముతున్న.రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు అని చెప్పిన కొనడం లేదు.దీంతో ఒక్కోసారి పండ్లు అన్నింటిని రోడ్డుపైనే పారబోస్తున్నామని పండ్ల విక్రేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరాకీ లేక అరకొర రేటుకే పండ్లను అమ్ముతున్న ఎవరు కొనడం లేదు అని జామ రైతులకు నష్టం భారీగా జరుగుతుంది అని జామ పండు విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు.ఎంతోమంది జామ రైతులు కరోనా వైరస్ కారణంగా అప్పులు తీర్చలేక.
ప్రభుత్వం నుండి సాయం అందక వారి పరిస్థితి తారుమారైందని చెప్తున్నారు.
పండ్ల రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, లాక్డౌన్, ఆంఫన్ తుపాన్తో పశ్చిమ బెంగాల్లో జామ సాగుదారులు, హోల్సేలర్లు తీవ్రంగా నష్టపోయారు.
ఇంకా అన్లాక్ దశలో అడుగుపెట్టినా లోకల్ ట్రైన్స్కు అనుమతి లేకపోవడంతో పండ్ల సరఫరాలూ దెబ్బతిన్నాయిని వారు చెప్పారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సీజన్లో జామ పండ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు, రైతులు వాపోతున్నారు.