హైదరాబాద్ జీఎస్టీ కమిషనర్ రేటులో నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి పన్ను ఎగవేత నిరోధక విభాగంలో పనిచేస్తున్న అధికారులే గతంలో సిబిఐకి పట్టుబడటం అందరికీ తెలిసిందే.తాజాగా ఇదే రీతిలో ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి జీఎస్టీ ఎగవేసిన కేసులో సెంట్రల్ ట్యాక్స్, ఎక్సైజ్ అధికారులు గోర్ధాన్ సింగ్, అర్జున్ చౌదరి, కిరణ్ చౌదరి అనే ముగ్గురిని అరెస్టు చేయడం జరిగింది.

వీళ్లంతా నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా జిఎస్టి రిజిస్ట్రేషన్ .నకిలీ కంపెనీల పేరిట ఇన్పుట్ బిల్స్ ఏర్పాటు చేయడం, అకౌంట్స్, ఐటీ, జీఎస్టీ ఫైలింగ్స్ను వెయిటింగ్ చేసినట్లు విచారణలో నిందితులు తప్పు ఒప్పుకోవడం జరిగిందని.వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలపటం మనకందరికీ తెలిసిందే.అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయగా.అసలు విషయాలు బయట పడటంతో 215 మందిని జీఎస్టీ అధికారులు అరెస్టు చేయడం జరిగింది.దాదాపు 2,200 పైగా కేసులు జీఎస్టీ అధికారులు ఫైల్ చేశారు.
ఇప్పటిదాకా జరిగిన విచారణలో దాదాపు 700 కోట్ల రూపాయలను రికవరీ కూడా చేయడం జరిగింది.దీంతో దేశవ్యాప్తంగా ఈ నకిలీ ఇన్వాయిస్ కేసు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అంతేకాకుండా ఆరుగురు చార్టెడ్ అకౌంట్ గా పనిచేసే అధికారులను కూడా జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
.