బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ షోకి ఎంతో పాపులారిటీ ఉండటంతో వివిధ భాషలలో ఈ కార్యక్రమం సీజన్లను పూర్తి చేసుకుంటూ పోతుంది.
ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకొని 5 వ సీజన్ ప్రసారమవుతుంది.అదే విధంగా తమిళంలో కూడా ఈ కార్యక్రమం 5 వ సీజన్ ప్రసారమవుతుంది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంపై గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె ఈ కార్యక్రమం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అసలు బిగ్ బాస్ హౌస్ లో జరిగే అవన్నీ నిజాలు కాదని ఆ కార్యక్రమాన్ని చూసి ఎవరు ఎవరిని జడ్జ్ చేయవద్దంటూ ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు.బిగ్ బాస్ రియాలిటీ షో లో 24 గంటల ముందు జరిగిన సన్నివేశాలను ప్రసారం చేస్తారని,ఆ కార్యక్రమంలో వారికి నచ్చని విషయాలను ఎడిట్ చేసే ఎక్కువగా గొడవలు సృష్టించే కార్యక్రమాలను మాత్రమే ప్రసారం చేస్తారని పేర్కొన్నారు.
అందుకే బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూసి ఎవరూ ఎవరిని జడ్జ్ చేయవద్దని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రసారం అయినప్పటి నుంచి ఇప్పటివరకు తాను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని.ఇలా నాతో పాటు చూడని వారు ఎవరైనా ఉన్నారా? అంటూ ఈమె ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఈమె ట్వీట్ కు స్పందించి పలువురు నెటిజన్లు రీ ట్వీట్ చేశారు.
గత సీజన్లో మీరే గెలుస్తారు భావించాము అంటూ కొందరు కామెంట్లు చేయగా నేను హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు ప్రతి రోజు దేవుడికి ప్రార్ధిస్తున్నాను అంటూ కస్తూరి సమాధానం చెప్పారు.