గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేయాలని చాలా మందికి ఉంటుంది.ఏదైనా కొత్త చేయాలని, ప్రపంచానికి తెలియాలని ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటారు.
అలాంటి ప్రయత్నమే అమెరికాకు చెందిన మహిళ చేసింది.తన వేలి గోళ్లను ఒకటి, రెండు కాదు.42 అడుగుల పొడువు పెంచేసింది.అంటే సుమారు నాలుగు అంతస్తుల భవనం కంటే ఎక్కవే అన్మమాట.
దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతివేళ్ల గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.
ఆమె పేరు డయానా ఆర్మ్ స్ట్రాంక్.
అయితే ఆమె గిన్నిస్ రికార్డు సాధించడం వెనుక ఓ విషాద గాథ ఉంది.డయానాకు 16 ఏళ్ల కూతురు లతీషా ఉండేది.
ఆమె ఆస్తమాతో చనిపోయింది.చనిపోయే ముందు రోజు లతీషా తన తల్లి గోళ్లను కత్తిరించి నెయిల్ పాలిష్ వేసింది.
తెల్లారేసరికి కూతురు చనిపోవడంతో.ఆమె గుర్తుగా డయానా గోళ్లు కత్తిరించుకోలేదు.
అలా 25 ఏళ్లుగా ఆమె గోళ్లను పెంచుతూ ఉంది.
ఇప్పుడు ఆమె గోర్లన్నీ కలిపి 42 అడుగుల 10.4 అంగుళాల పొడువు ఉన్నాయి.అత్యంత పొడువు గోళ్లతో ఆమె గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది.
గోళ్లు ఎందుకు కత్తిరించుకోవడం లేదని చాలా మంది ఆమెను అడిగారు.కూతురి గుర్తుగా వీటిని పెంచుతున్నట్లు చెప్పడంతో.
దాని గురించి అడగడం మానేశారు.ఆ గోళ్లను చూసిప్పుడల్లా తన కూతురు తనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని డయానా చెప్పుకొచ్చింది.
అంత పొడువు గోళ్లతోనే డయానా అన్ని పనులు చేసుకుంటుంది.అయితే వంట మాత్రం చేయలేనిని తెలిపింది.
ఆమె గోళ్లకు పెయింట్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుందట.గోళ్లకు నెయిల్ పాలిష్ చేసేందుకు 15 నుంచి 20 పాలిష్ సీసాలు అయిపోతాయని డయానా చెప్పింది.