సంజ‌య్ పాద‌యాత్ర‌కు పెరుగుతున్న క్రేజ్‌.. బీజేపీ ఢిల్లీ అధిష్టానం అండ‌తోనే..

ఇప్పుడు తెలంగాణ‌లో పాద‌యాత్ర‌లో జోరు కొన‌సాగుతోంది.కాంగ్రెస్ నాయ‌కులు చాలామంది చేస్తామ‌న్నా కూడా అది ముందుకు ప‌డ‌లేదు.

 Growing Craze For Sanjay Padayatra Bjp Dominates Delhi, Sanjay, Bjp, Maharashtra-TeluguStop.com

కానీ బీజేపీ నుంచి పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్ మాత్రం అనుకున్న‌దే త‌డ‌వుగా పాద‌యాత్ర‌ను ప్రారంభించేశారు.పాత‌బస్తీ నుంచి దీన్ని ప్రారంభించ‌డంతో పెద్ద ఎత్తున క్రేజ్ వ‌చ్చేసింది.

ఇంకేముంది అనుకున్నంత ప‌బ్లిసిటీ రావ‌డంతో బాగానే స‌క్సెస్ అయింద‌ని తెలంగాణ బీజేపీ నేత‌లు భావిస్తున్నా కూడా ఇంకా క్రేజ్ తీసుకురావాల‌ని కేంద్ర బీజేపీ పెద్ద‌లు కూడా బాగానే స‌పోర్టు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రావ‌డంతో అనుకున్నంత క్రేజ్ వ‌చ్చేసింది.

ఎందుకంటే తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు చేస్తున్న పాద‌యాత్ర అంటే కేవ‌లం తెలంగాణ వ‌ర‌క‌రే ప‌రిమితం అవుతుంద‌ని అంతా అనుకుంటున్న త‌రుణంలో బీజేపీ కేంద్ర పెద్ద‌లు ఎంట‌ర్ అయి ఇలా క్రేజ్ తీసుకువ‌స్తున్నార‌న్న మాట‌.ఇక వ‌స్తూనే దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు.

ఇప్పుడు బండి సంజ‌య్ చేస్తున్న పాద‌యాత్ర తెలంగాణ రాజకీయాల్లో స్ప‌ష్ట‌మైన మార్పు తెస్తుందన్నారు.

మ‌రోవైపు సీఎం కేసీఆర్ మీద కూడా నిప్పులు చెరిగారు ఆయ‌న.

Telugu Bandisanjay, Bjp Central, Congress, Fadnavis Kcr, Maharashtra Cm, Sanjay,

కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటూ కేవలం ఆయ‌న కుటుంబం కోసమే ప‌నిచేస్తుంటార‌ని, ఆయ‌న ఫాంహౌజ్ సీఎం అంటూ నిప్పులు చెరిగారు.ఆయ‌న ఫామ్ హౌస్లో ఉంటే బండి సంజయ్ మాత్రం ప్ర‌జ‌ల కోసం, రైతుల కోసం మీ మధ్యకు వ‌చ్చి కూర్చొని మాట్లాడుతున్నారంటూ బాగానే మ‌ద్ద‌తు తెలిపారు.కేసీఆర్ ఆయ‌న చ‌రిత్ర‌లో ఎప్పుడైనా తెలంగాణ రైతులతో స‌మావేశాలు నిర్వ‌హించారా లేదంటే వారి ప‌క్క‌నే కూర్చున్నారా అంటూ మండిప‌డ్డారు.ఇక బీజేపీ గెలుపు ఖాయ‌మంటూ ప్ర‌క‌టించేశారు.

Telugu Bandisanjay, Bjp Central, Congress, Fadnavis Kcr, Maharashtra Cm, Sanjay,

అయితే ఇక్క‌డే బీజేపీ ప్లాన్ బాగా వ‌ర్కౌట్ అవుతుంది.కావాల్సినంత మీడియా క‌వ‌రేజ్ కూడా వ‌చ్చేస్తోంది.ఎందుకంటే కేవ‌లం దీన్ని రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ప‌రిమితం చేస్తే ఇంత క్రేజ్ వ‌చ్చేది కాదేమో.కానీ ఇప్పుడు ప‌క్క రాష్ట్ర‌మైన మ‌హారాష్ట్ర మాజీ సీఎం రావ‌డం బాగానే క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పాలి.

ఇక బండి సంజ‌య్ కూడా రైతుల స‌మ‌స్య‌ల‌ను బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.కేసీఆర్ తెలంగాణ‌లో రైతుబంధు పథకాన్ని పెట్టి రైతుల‌కు మిగిలిన అన్ని ర‌కాల ఎరువుల‌, ఇత‌ర సామాగ్రి సబ్సిడీలను ఆపేసిన‌ష్టం చేస్తున్నారండూ వివ‌రిచండం కూడా బాగానే క‌లిసి వ‌స్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube