ఆడ పిల్లలను ఇప్పటికి చులకనగా చూసే సమాజం మనది.అలాంటి సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఈ విషయం తెలిస్తే మీకే అర్ధం అవుతుంది.
తన తల్లి కోరిక తీర్చడం కోసం రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు.అంతేకాదు ఆమెను గౌరవంగా హెలికాఫ్టర్ లో తీసుకువచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు.
ఈ అపురూప మైన ఘటన హర్యానా లో చోటు చేసుకుంది.
పెళ్లి అంటేనే ముందుగా మన దేశంలో అందరు కట్నం ఎంత తీసుకుంటున్నారు.
లేదా కట్నం ఎంత ఇస్తున్నారు.అనే మాటలే వినిపిస్తాయి.
ఆ తర్వాతే మిగతా ప్రశ్నలు.కట్నం తీసుకోవడం చట్టరీత్య నేరం అని తెలిసి కూడా ఎవ్వరు కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.
చదువుకుని పెద్ద పెద్ద పట్టాలు పొందిన వారు కూడా కట్నం తీసుకుంటూ ఈ దురాచారాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు.
ఇప్పటికి వరకట్న వేధింపులకు అమాయక మహిళలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
అయితే మరికొంత మంది మాత్రం కట్నం లేకుండా పెళ్లి చేసుకుని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.తాజాగా హర్యానాలో ఒక వ్యక్తి తన తల్లికి ఇచ్చిన మాట కోసం కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు.మాజీ కౌన్సిలర్ రామ్ కుమార్ కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు.ఇప్పటికే ఇద్దరి కొడుకులకు కట్నం లేకుండా పెళ్లి చేసాడు.
ఇప్పుడు మూడవ కొడుకు మనీష్ కూడా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు.ఆయన భార్య కట్నం తీసుకోకూడదనే కోరికను వారి కుటుంబం అంత పాటిస్తున్నారు.అమ్మాయి విలువ అందరికి చాటి చెప్పేందుకు తన చిన్న కోడలిని హెలికాఫ్టర్ లో తీసుకు రావాలని తల్లి కోరగా ఆమె కోరికను తీర్చాడు.తన భార్యను హెలికాఫ్టర్ లో ఇంటికి తీసుకు రావడంతో కుటుంబంతో పాటు గ్రామ ప్రజలు కూడా ఆనందంగా ఆ జంటను కళ్లారా చూసారు.
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.