ఇటీవల కాలంలో మనుషులు మృగాలుగా మారుతున్నారు.చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీసుకుంటున్నారు.
ఇక అలానే పెళ్లిలో మద్యం ఇవ్వలేదని వరుడిని దారుణంగా హత్య చేశారు.ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారిన అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటుచేసుకుంది.పెళ్ళికి స్నేహితులను పిలిచిన వరుడు వారికీ పార్టీ ఏర్పాటు చేశాడు.
మంచి విందు, మందు అన్ని ఏర్పాటు చేశాడు.అప్పటికే పెళ్లి జరగడంతో అతను కూడా స్నేహితులతో కలిసి గడిపేందుకు అక్కడే ఉన్నాడు.
కానీ అడిగినంత మద్యం, మందు ఏర్పాటు చెయ్యలేదని నవ వరుడిని దారుణంగా పొడిచి చంపారు అతడి స్నేహితులు.అప్పటికే పీకల దాకా తాగారని కానీ ఇంకా మద్యం కావాలని అడిగినట్టు అతను ఒప్పుకోకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడే ఉన్న మరికొందరు చెప్పుకొచ్చారు.
తీవ్రంగా గాయపడిన వరుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు.
వరుడు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసారు.
మిగితా నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నయ్.చిన్న చిన్న విషయాలకు హత్యలు చేసుకుంటున్నారు.
కోడి కూర వండలేదనే చిన్న చిన్న కారణాలకు కూడా భార్యలను హత్య చెయ్యడం.డబ్బులు ఇవ్వలేదని భర్తను చంపడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయ్.
లాక్ డౌన్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగాయని.బయటకు వెళ్ళడానికి లేక ఇంట్లోనే భార్య భర్తలు ఉండడంతో గొడవలు ఎక్కువ అయ్యి ఇలాంటి ఘటనలు జరిగినట్టు కొన్ని సర్వేల్లో తేలింది.